స్థానిక బస్టాండ్ సెంటర్లో శనివారం మెగాస్టార్ చిరంజీవి జన్మదిన వేడుకలను అభిమానులు,కూటమి నేతలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అనంతరం కూటమి నాయకులు మాట్లాడుతూ,చిరంజీవి కేవలం సినిమాల్లోనే కాకుండా సమాజ సేవలోనూ ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో కూటమి నేతలు బూస రామాంజనేయులు, కర్ణ సైదారావు, తోట అల్లయ్య, రంగా, కేసానుపల్లి కృష్ణబాబు, జనసేన పార్టీ కారంపూడి పట్టణ అధ్యక్షుడు తొలగినేని లక్ష్మయ్య తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు
పాల్గొన్నారు.
0 Comments